జై లవకుశ అరుదైన ఘనత సాధించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా.. టీజర్ కోటి వ్యూస్ సాధించింది. ఇటీవల జై పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ 48 గంటల్లోపే కోటి మార్కును చేరింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ వెల్లడించింది.
ఇంతటి సంచలన స్పందన అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేసింది. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21న విడుదల కాబోతోంది.
Source: V6News
1 Crore Digital Videos in less than 48 hours for #RecordBreakingJaiTeaser. Thank you everyone for this sensational response 🙏🏻 pic.twitter.com/8IFFPLXOdv
— NTR Arts (@NTRArtsOfficial) July 8, 2017